మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అంటూ అంతా చాలా నమ్మకంతో ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈ చిత్రంలో నయనతార నటించింది.ఇదే సినిమాలో ఒక కీలక పాత్రను తమన్నా కూడా పోషించింది.
సినిమాలో తమన్నా వేశ్య పాత్రలో నటించిందని మొదట వార్తలు వచ్చాయి.కాని ఇటీవల విడుదలైన పాటను చూస్తుంటే తమన్నా కూడా ఒక ఆస్తానంకు రాణిగా కనిపించబోతుందా అనిపిస్తుంది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను ఇష్టపడే ఒక రాణి పాత్రను తమన్నా పోషిస్తుంది.సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువగానే ఉంటుంది.ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉందన్న కారణంగా ఆమెకు రెండు పాటలను పెట్టారు.అందులో ఒకటి సైరా అంటూ టైటిల్ సాంగ్.ఆ పాటలో నయనతార కూడా కనిపించబోతుంది.ఇక మరో పాట చిరంజీవితో రొమాంటిక్గా సాగబోతుంది.
బాహుబలి చిత్రంలో పచ్చబొట్టేసిన తరహాలో అందాల ఆరబోస్తూ తమన్నా ఆ పాటలో నటించిందట.ఆ పాటను ఇప్పుడు సినిమా నుండి తీసేయాలని నిర్ణయించుకున్నారు.
సినిమా లెంగ్త్ దాదాపుగా మూడు గంటలు అవుతున్న కారణంగా రెండు పాటలను మరియు ఒకటి రెండు సీన్స్ను తగ్గించి దాదాపు 20 నిమిషాల నిడివి తగ్గించినట్లుగా తెలుస్తోంది.సినిమాకు సక్సెస్ టాక్ వస్తే ఆ 20 నిమిషాలను యాడ్ చేయాలని భావిస్తున్నారు.మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా చిత్రం నుండి తమన్నా పాటను తొలగించడంపై ఆమె అసంతృప్తిగా ఉంది.ఆమెకు అన్యాయం జరిగిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.