టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా చివరిగా ఎఫ్2 తో మరో సూపర్ బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకుంది.అలాగే సైరా నరసింహా రెడ్డి లాంటి పెద్ద ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటిస్తుంది.
మరో వైపు తమిళంలో ప్రభుదేవాకి జోడీగా దేవి అనే హర్రర్ సినిమాలో తమన్నా హిట్ కొట్టింది.ఇది తెలుగులో అభినేత్రి అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ లో తమన్నా బిజీగా ఉంది.ఇదిలా ఉంటె తమన్నా తెలుగులో మరో హర్రర్ కామెడీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
రాజుగారి గది సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు, టెలివిజన్ యాంకర్ ఓంకార్, చివరిగా రాజుగారి గది 2 సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమాలో నాగార్జున సమంత కీలక పాత్రలలో కనిపించారు.
అయితే భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.దీంతో గత కొంత కాలంలో సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఓంకార్ మళ్ళీ మరో హర్రర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమా కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని సంప్రదించగా కథ విన్న తర్వాత ఆమె అతని మూవీలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.