మిల్కీబ్యూటీ తమన్నా ఆహా కోసం ఒక టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ టాక్ షో చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందని తెలుస్తోంది.
తమన్నాతో ఈ టాక్ షోను రెండు సీజన్లుగా చిత్రీకరించబోతున్నారు.మొదటి సీజన్లో 50 మందితో ఇంటర్వ్యూను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ఆ తర్వాత కొన్ని నెలలలో మరో సీజన్ ఉంటుంది.ఆ రెండవ సీజన్లో కూడా 50 మందితో తమన్నా టాక్ షో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
తమన్నా ఈ టాక్ షో కోసం భారీ పారితోషికంను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.మొదటి సీజన్కు గాను ఇప్పటికే ఈమె కోటి రూపాయల వరకు తీసుకుందట.
మరో పాతిక లక్షలు ఆమెకు వెళ్లనున్నాయట.ఇక రెండవ సీజన్కు మరికాస్త ఎక్కువ పారితోషికం ఆమెకు అందనుంది.
సీజన్ 1 కు వచ్చే రెస్పాన్స్ను బట్టి ఆమె పారితోషికం పెరుగనున్నట్లుగా చెబుతున్నారు.అతి త్వరలోనే తమన్నా టాక్ షో స్ట్రీమింగ్కు రెడీ అవుతుంది.50 మంది సెబ్రెటీలతో టాక్ షో అంటే మామూలు విషయం కాదు.
ఖచ్చితంగా అందులో కొంత మంది ఇంటర్వ్యూలు సక్సెస్ అయినా కూడా ఆహాకు మంచి డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.50 ఎపిసోడ్స్గా ఈ సీజన్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు.అది రోజుకు ఒక ఎపిసోడ్ చొప్పున ఉంటుందా లేదంటే ఒకే సారి 50 ఎపిసోడ్స్ను స్ట్రీమింగ్ చేస్తారా అనే విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.