తెలుగు ఓటీటీ ఆహా కోసం మిల్కీ బ్యూటీ తమన్నా ఒక టాక్ షో ను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ షోకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షోను అతి త్వరలో ప్రసారం చేయబోతున్నారు.రెండు సీజన్ లుగా ఈ టాక్ షో ప్రసారం కాబోతుంది.
రెండు సీజన్ లో కలిపి మొత్తం వంద మందిని తమన్నా ఇంటర్వ్యూ చేసినట్లుగా తెలుస్తోంది.తమన్నా షో మొదటి ఎపిసోడ్ ను మెగా స్టార్ చిరంజీవితో ప్లాన్ చేశారట.
ఈ విషయంలో ఆహా నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటి వరకు చిరంజీవి ఎన్నో వందల ఇంటర్వ్యూ లు ఇచ్చారు.
అయితే వాటిలోకి ఇది చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేశారట.తమన్నా టాక్ షోను ప్రముఖ దర్శకుడు పర్యవేక్షిస్తున్నాడు.
దాంతో షో పై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది.కేవలం స్టార్స్ నుండి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం మాత్రమే కాదు.
వారితో విభిన్నమైన గేమ్ లను కూడా ఆడివ్వనున్నారట.తెలుగు బుల్లి తెరపై ఇదో విభిన్నమైన గేమ్ షో కమ్ టాక్ షో గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
వంద ఎపిసోడ్ ల ఈ టాక్ షో కు గాను ఇప్పటికే 50 ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తి చేశారు.ప్రస్తుతం ఎడిటింగ్ ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి.త్వరలోనే షో కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ షో ఉంటుందని ఆహా వర్గాల వారు అంటున్నారు.మిల్కీ బ్యూటీని కొత్తగా ఈ షో తో చూడటంతో పాటు ఎంతో మంది స్టార్స్ కు సంబంధించిన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం.