టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం వంటి భాషలలో కూడా నటించింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ సర్వీస్ లో కూడా ముందుంటుంది తమన్నా.
2005లో శ్రీ అనే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా ఈ సినిమాతో అంత గుర్తింపు తెచ్చుకోలేదు.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించగా మంచి సక్సెస్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అంతేకాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.
ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన బాహుబలి లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ప్రస్తుతం మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.
రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం కే జి ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమా తర్వాత కన్నడ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.
ఇక ఆ సినిమా భారీ యాక్షన్ థ్రిల్లర్ తో పాటు ఆర్మీ నేపథ్యంలో రూపొందనుందట.ఇక ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది.
ఇది వరకే కేజిఎఫ్ 1 సినిమాలో యష్ సరసన స్పెషల్ సాంగ్ లో మెప్పించిన తమన్నా ఈ సారి ఏకంగా హీరోయిన్ గా నటించనుందని సమాచారం.ఇక ప్రస్తుతం తమన్నాతో ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయట.త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట.ఇది కాకుండా మరో రెండు సినిమాలలో బిజీగా ఉన్నా తమన్నా గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.