సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురాం దర్శకత్వంలో సర్కారు వాటి పాట సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపొయింది.ఇక ఈ సినిమా టైటిల్ కి సోషల్ మీడియాలో ఎక్కడ లేని బజ్ వచ్చింది.
సూపర్ స్టార్ అభిమానులు విపరీతంగా పోస్టర్ ని షేర్ చేసి ట్రెండ్ చేశారు.సెలబ్రిటీ ప్రముఖులు కూడా సినిమా టైటిల్ పై పాజిటివ్ గా స్పందించారు.
అలాగే అభిమానుల ఆనందానికి అవధులు లేవు.సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కూడా కావడంతో ఈ సినిమా టైటిల్ తో, పాటు కృష్ణ బర్త్ డే హ్యాస్ ట్యాగ్ భాగా ట్రెండ్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పరశురాం ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న తమన్ ని తీసుకున్నాడు.ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తమన్ ఏకంగా దేవిశ్రీ ప్రసాద్ ని క్రాస్ చేసి సినిమాలు చేస్తున్నాడు.
అల వైకుంఠపురంలో సాంగ్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి.కాపీ మ్యూజిక్ అనే రిమార్క్ ఉన్నా కూడా స్టార్ హీరోలు అతని మ్యూజిక్ కోసమే ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి దర్శకుడు పరశురాం ఈ సినిమాకి తనకి ముందు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన గోపీ సుందర్ ని తీసుకోవాలని భావించాడు.అయితే మహేష్ రిఫరెన్స్ తో తమన్ తో చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ ట్విట్టర్ లో స్పందించాడు.7 ఏళ్ళ తర్వాత మహేష్ బాబు తో తిరిగి పని చేస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, పేర్కొన్నాడు.ఈ సినిమా కోసం కష్టపడి పని చేస్తామని పేర్కొంటూ ఒక ట్వీట్ చేసాడు.దర్శకుడు పరుశురాం కి కూడా ధన్యవాదాలు చెప్పాడు