ఆఫ్గాన్ దేశం లో తాలిబాన్ లు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కొల్లగొట్టి తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని.
తమ హస్తగతం లోకి తీసుకోవడం జరిగింది.ఇటువంటి తరుణంలో కొత్తగా ఏర్పడిన తాలిబాన్ ప్రభుత్వం.
దేశ పౌరులకు కొత్త పాస్ పోర్ట్ జారీ చేయాలని డిసైడ్ అయ్యింది.తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ వేదికగా ఈ విషయం ఇటీవల తెలియజేశారు.
పాస్ పోర్ట్ మాత్రమే కాకుండా పాస్ పోర్టుతో పాటు తజ్కిరా (జాతీయ ఐడీ కార్డు) కూడా జారీ చేస్తామని ఆయన తెలిపారు.మహిళలకు సంబంధించి పాస్ పోర్ట్ విషయంలో.
మహిళా అధికారులు చూస్తారని స్పష్టం చేశారు.ఎక్కడుంది దేశంలో వేగవంతంగా కొత్త పాస్ పోర్ట్ ప్రక్రియ జరుగుతుందని తాలిబాన్ అధికారులు తెలిపారు.
ఎప్పుడైతే తాలిబాన్ లు.ఆఫ్ఘనిస్తాన్ లో విధ్వంసం సృష్టించడం స్టార్ట్ చేశారో అప్పటినుండి పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోయాయి.ఈ క్రమంలో.తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడటంతో తాజాగా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
గతంలో మాదిరిగా కాకుండా కొత్త ఆంక్షలు కూడా విధించినట్లు సమాచారం.