టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే.చిరంజీవి గత ఏడాది కరోనా సమయంలో పలువిధాల వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూండేవాడు.
అంతేకాకుండా వైరస్ గురించి పలు జాగ్రత్తలు చెప్పిన విషయాల గురించి తెలిసిందే.అయితే చిరంజీవి సినిమాలో మరో హీరో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
భారతదేశ నటి సత్యదేవ్.ఈయన సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న హీరో.సత్య దేవ్ కు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం.ఆయన కోసం ఆయన సినిమాలను మళ్లీ మళ్లీ చూసిన రోజులు కూడా ఉన్నాయని తెలిపారు సత్యదేవ్.
ఆయనంటే అంత పిచ్చి అంటూ.గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు.
దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అప్పట్లో.చిరంజీవి తో దిగిన ఫోటోను కూడా షేర్ చేస్తూ 2020 సంవత్సరానికి వీడ్కోలు తెలిపాడు.
కాగా ఓ పిట్ట కథ సినిమా ఆడియో రిలీజ్ సమయంలో.సత్యదేవ్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన మాటలు తెలిపారు.
కాగా చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మలయాళం నుంచి మంచి విజయాన్ని సాధించుకున్నా “లూసిఫర్”.ఈ చిత్రం ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు కాగా ఈ చిత్ర దర్శకుడు మోహన్ రాజా చిరంజీవి సినిమాకు దర్శకత్వం చేస్తున్నాడు.కాగా ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలు కావడంతో.ఈ సినిమాలో ఓ పాత్ర కోసం సినీ నిర్మాతలు సత్యదేవుని ఎంచుకున్నారు.దీంతో సత్యదేవ్ తనకిష్టమైన చిరంజీవి సినిమాలో అవకాశం ఉంటే అసలు కాదంటాడా? వెంటనే ఒప్పుకున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రకటనలు త్వరలోనే రానున్నాయి.
కాక తెలుగులో లూసిఫర్ తమిళ దర్శకుడు మోహన్ రాజా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ ను సాధించుకుంది.అంతేకాకుండా ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా ఈ ఏడాది విడుదల కు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా వరుసగా మరో మూడు చిత్రాలలో నటించబోతున్నానంటూ చిరంజీవి తెలిపాడు.