ఇకనైనా వారు మూసుకోవాలి

ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న విపక్ష పార్టీల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు హుజూర్‌ నగర్‌ ఫలితాల తర్వాత అయినా నోరు మూసుకుంటే మంచిది అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసినా కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకుని విమర్శలు చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్‌ అయ్యిందని, ఇకపై అయినా ప్రభుత్వం చేస్తున్న పనులను కాస్త చూసి ప్రజలకు జరుగుతున్న మేలును గురించి తెలుసుకుని మాట్లాడాలంటూ విపక్ష పార్టీ నాయకులకు సూచించాడు.

 Talasani Srinivas Yadav Comments On Huzurnagar Elections-TeluguStop.com

ఇంకా మంత్రి తలసాని మాట్లాడుతూ.మొన్న ఎన్నికల ప్రచార సమయంలో నోరు పారేసుకున్న వారందరికి ప్రజలు తగిన బుద్ది చెప్పారని, వారు ప్రజలు ఇచ్చిన షాక్‌తో అయినా కాస్త తగ్గాలంటూ మంత్రి హెచ్చరించాడు.

ప్రతి ఒక్కరు కూడా తమ హోదాకు తగ్గట్లుగా మాట్లాడటంతో పాటు ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని సూచించాడు.సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామంటూ తలసాని హెచ్చరించాడు.

విమర్శలకు ఒక హద్దు ఉండాలని ఆయన సూచించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube