జానారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని.. ?

నాగార్జునసాగర్ లో జరగనున్న ఉప ఎన్నిక ప్రచారంలో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా, మాటల యుద్ధం కూడా తీవ్రంగా ముదురుతుంది.కాగా సాగర్ బరిలో టీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్ కు డిపాజిట్ దక్కించి గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్న గులాభి బాస్ ఇక్కడ ప్రచారానికి ముఖ్య నేతలను దించారు.

 Talasani, Sensational Comments, Janareddy, Congress , Ts Poltics-TeluguStop.com

ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రచారంలో పాల్గొన్నారు.కాగా పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామంలో జరిగిన ఈ ప్రచార సభలో తలసాని మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జానారెడ్డికి ఓటేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, గతంలో అధికారంలో ఉన్నప్పుడే జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, మళ్లీ గెలిస్తే చేసేది ఏం ఉండదని విమర్శించారు కాబట్టి ప్రజల సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ నే గెలిపించాలని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటు లో ఉండే భగత్ ను ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube