ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ క్రమంలోనే యాత్ర కోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించుకున్న జనసేనాని వారాహి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
వారాహి వాహనంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ పవన్ కల్యాణ్ కనీసం తనను శ్వాస అయినా తీసుకోనిస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
శ్వాస తీసుకో పవన్ కల్యాణ్.ప్యాకేజీ వద్దు అంటూ ఎద్దేవా చేశారు.