ఇప్పుడు వైద్యులు దేవుళ్ళు కాదు.వ్యాపారాలు.
తుమ్ము వచ్చింది అని ఆస్పత్రికి వెళ్ళాం అంటే చాలు.ఏదో ఒక రోగం అంటగట్టి పంపిస్తారు.
వాళ్ళ వ్యాపారం కోసం ప్రైవేటు డాక్టర్లు ఎంతకైనా తెగించేస్తున్నారు.ఈ విషయాన్నీ మెగాస్టార్ చిరంజీవి 17 ఏళ్ళ క్రితమే ఠాగూర్ సినిమాలో చూపించారు.
చచ్చిన శవానికి చికిత్స చేసే డాక్టర్లు ఉన్నారు.ఈ వైద్యులు మాములు వాళ్ళు కాదు అని.జాగ్రత్తగా ఉండాలి అని అయన అప్పట్లోనే చెప్పడు.అలాంటి ఘటనే ఇప్పుడు మళ్ళి జరిగింది.
ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులపై బలమైన నమ్మకం ఉంది.అలాంటిది.
మళ్ళి ఇప్పుడు ఈ ఘటనలు జరిగి ఉన్న కాస్త నమ్మకాన్ని పొగుడుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
హైదరాబాద్లో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కార్పొరేటు పిల్లల ఆస్పత్రి సిబ్బంది డబ్బు కోసం కక్రుర్తి పడి 25 రోజుల వయసున్న పాప శవంపై రాజకీయం చేశారు.చౌటుప్పల్ డెక్కన్ తండాకు చెందిన పరమేష్, పావని అనే దంపతులు వారి పాపను ఆస్పత్రికి తీసుకువచ్చారు.
అయితే కాసుల కోసం ఆ పాప ఉమ్ము నీరు తాగిందని.అందు వల్ల సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు.
దీంతో ఆ చిన్నారికి పరీక్షలు నిర్వహించి.రోజుకు 30 వేల రూపాయిలు ఖర్చు అవుతుంది అని.వారు ఖచ్చితంగా బతికిస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ దంపతులతో 1.2 లక్షల రూపాయలు కట్టించుకున్నరు.అయితే ఇప్పుడు పాప ఆరోగ్యం బాగుంది అని.డబ్బు మొత్త కట్టాలని ఒత్తిడి తెచ్చారు.తీరా పాపను చూస్తే.ఆ పాప అప్పటికే మృతి చెంది ఉంది.దీంతో ఆ వైద్యులు మోసం చేసారు అని తెలుసుకున్న పాప తల్లితండ్రులు తమ బంధువులతో ఆందోళనకు దిగారు.చూశారా .ప్రైవేటు ఆస్పత్రి యజమాన్యం ఎంత దారుణంగా ఉంది అనేది ?
.