టాలీవుడ్ లో ఎప్పుడో కూలీ నెంబర్ 1 సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి టబు.తెలుగులో కంటే బాలీవుడ్ లో ఆమెకి సక్సెస్ ఫుల్ కెరియర్ ఉంది.
హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత నటిగా తనలోని మరో కోణాన్ని చూపిస్తున్న టబు అక్కడ మంచి పాత్రలు చేస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉంది.సెకండ్ ఇన్నింగ్ లో నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు.
మరల అల వైకుంఠపురంలో సినిమాతో చాలా ఏళ్ల తర్వాత తల్లి పాత్రలో టాలీవుడ్ లో టబు ఎంట్రీ ఇచ్చింది.టబు ఇప్పుడు మరో తెలుగు చిత్రానికి సైన్ చేసినట్టు తెలుస్తుంది.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా అంధాధున్ రీమేక్ తెలుగులో రాబోతుంది.హిందీలో ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటించింది.ఇక ఈ పాత్ర కోసం తెలుగులో చాలా మంది భామల పేర్లు పరిశీలించారు.చివరికి అనసూయ పేరు ప్రముఖంగా వినిపించింది.
అయితే నిర్మాతలు ఫైనల్ గా టబుని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.ఇక తెలుగు మాతృభాష కావడంతో ఆమె కూడా ఆలోచించకుండా చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
ఆమె అయితే పెర్ఫెక్ట్ ఛాయస్ అని భావించి నిర్మాతలు ఆమెని ఒప్పించినట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు వెచ్చి చూడాల్సిందే.