తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు అజిత్ ప్రస్తుతం తన దృష్టిని మొత్తం సినిమాలపై ఉంచారు.ఈ క్రమంలోనే వరుస సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్న అజిత్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “వలిమై“గురించి అందరికీ తెలిసిందే.
పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో అజిత్ తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలోనే హెచ్.వినోద్ దర్శకత్వంలో, బోనికపూర్ నిర్మాణంలో అజిత్ మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడం కోసం బాలీవుడ్ సీనియర్ నటి టబును సంప్రదించినట్లు సమాచారం.
అయితే హీరో అజిత్ టబు కాంబినేషన్లు సుమారు 22 సంవత్సరాల క్రితం రాజీమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ‘కండుకొండేన్ కండుకొండేన్’ అనే చిత్రంలో నటించారు.తిరిగి ఈ ఏడాది మరొక చిత్రం ద్వారా వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు.22 ఏళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్ మరొకసారి ప్రేక్షకులను సందడి చేయనుంది అయితే బోని కపూర్ నిర్మాణం తమిళంలో తెరకెక్కుతున్న చిత్రాలలో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్ లను తీసుకోవటం విశేషం.ఇప్పటికే ఆయన నిర్మాణంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వలిమై’ చిత్రంలో హీరోయిన్గా హ్యూమా ఖురేషీకి అవకాశం ఇచ్చిన బోనీకపూర్ ప్రస్తుతం టబుకి ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.