ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వరుసగా ఫీమేల్ సెంట్రిక్ కథలతో హిట్ మీద హిట్ కొడుతున్న అందాల భామ తాప్సి.తెలుగులో పదేళ్లు ఉన్న ఆమెకి సరైన గుర్తింపు రాలేదు.
నటనకి ఆస్కారం ఉన్న సినిమాలు పెద్దగా చేసింది లేదు.చేసిన కూడా ఆ సినిమాల క్రెడిట్ తాప్సికి సొంతం కాలేదు.
కేవలం టాలీవుడ్ లో ఆమెని గ్లామర్ హీరోయిన్ గా దర్శక, నిర్మాతలు చూపించారు.అయితే రెగ్యులర్ పాత్రలతో విసిగిపోయిన తాప్సి బాలీవుడ్ కి చెక్కేసింది.
అక్కడ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వైపు వెళ్లకుండా కొత్త కథలు ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకరుగా నిలబడింది.ఫీమేల్ సెంట్రిక్ కథలకి ముందుగా కంగనా రనౌత్ కేరాఫ్ గా ఉండేది.
అయితే ఆమె రేంజ్ మారిపోయివడంతో బడ్జెట్ లు కూడా పెరిగిపోయాయి.ఆమెతో సినిమా చేయాలంటే కనీసం వంద కోట్లు పెట్టుకోవాలి.
ఈ నేపధ్యంలో ఆమెకి ప్రత్యామ్నాయంగా తాప్సి దర్శకులకి కనిపించింది.
దీంతో ఆమెకి అవకాశాలు క్యూ కట్టాయి.ఇక క్యారెక్టర్ పెర్ఫెక్షన్ కోసం ఆమె డెడికేషన్ కి కూడా దర్శక, నిర్మాతలు ఫిదా అయిపోతున్నారు.ప్రస్తుతం ఈ అమ్మడు రష్మీ రాకెట్ అనే సినిమా చేస్తుంది.
ఇండియన్ ఫీమేల్ స్ప్రింటర్ నిజజీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ పాత్ర పెర్ఫెక్షన్ కోసం తాప్సి ఎక్కువ సమయంలో జిమ్ లో లేదంటే రన్నింగ్ ట్రాక్ పై పరుగులు తీస్తూ ఒళ్ళు హూనం చేసుకుంటుంది.
మరో వైపు మిథాలీ రాజ్ బయోపిక్ కోసం తనని తాను ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకుంటుంది.గతంలో పెద్దగా జిమ్ లో స్పెండ్ చేయని తాప్సి ఈ సినిమాల కోసం పూర్తిగా బాడీ లాంగ్వేజ్, ఫిట్ నెస్ పరంగా తనను తాను మార్చుకోవడం చూస్తూ అంటే సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక రష్మీ రాకెట్ సినిమా కోసం తాను ఎలా ప్రిపేర్ అవుతున్న అనే విషయాన్ని ట్రాన్స్ఫర్మేషన్ వీడియో తో పెట్టి తాప్సి చూపించింది.