సౌత్ లో స్టార్ హీరోయిన్ కాలేకపోయినా పంజాబీ భామ తాప్సి బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.వరుసగా ఫీమేల్ సెంట్రిక్ కథలతో హిట్ మీద హిట్ కొడుతోంది.
ప్రస్తుతం ఆమె ఏకంగా మూడు బయోపిక్ సినిమాలు చేస్తుంది.అందులో రష్మీ రాకెట్ ఒకటి కాగా, మిథాలీ రాజ్ జీవిత కథతో తెరకెక్కబోయే సినిమా ఒకటి ఉంది.
వీటితో పాటు మరో స్పోర్ట్స్ స్టార్స్ సినిమా కూడా ఆమె చేయబోతుంది.ప్రస్తుతం తాప్సి రష్మీ రాకెట్ సినిమా షూటింగ్ లో ఉంది.
ఈ సినిమా కోసం కంప్లీట్ అథ్లెట్ గా మారిపోయిన రష్మీ షూటింగ్ ని అంతే స్పీడ్ గా కొనసాగిస్తుంది.అయితే పెద్దగా కమర్షియల్ సినిమాల వైపు మాత్రం ఈ అమ్మడు దృష్టిపెట్టడం లేదు.
ఫీమేల్ సెంట్రిక్ మూవీలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన తాప్సి త్వరలో కంగనా ప్లేస్ ని ఆక్యుపై చేస్తుందనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ మధ్య తెలుగులో అలివేలు వెంకటరమణ సినిమా కోసం గోపీచంద్ తో మరో సారి నటించడానికి తాప్సి ఒకే చెప్పేది.
ఈ సినిమా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
మరో వైపు బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు తాప్సి పేరు వినిపిస్తుంది.
రాజ్ కుమార్ హిరాణి – షారూక్ కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.ఇందులో హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉంటుందని, ఈ కారణంగా గ్లామర్ కంటే మంచి టాలెంటెడ్ హీరోయిన్ అయితే బెటర్ అని భావించిన దర్శకుడు తాప్సికి కథ కూడా వినిపించాడని, ఆమె నటించడానికి ఒకే చెప్పేసిందని తెలుస్తుంది.త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.