టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని ప్రస్తుతం బాలీవుడ్ లో ఫీమేల్ సెంట్రిక్ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన అందాల భామ తాప్సి.ఈ అమ్మడు టాలీవుడ్ లో పదేళ్లుగా సినిమాలు చేస్తున్న నటిగా రాని గుర్తింపు బాలీవుడ్ లో కేవలం మూడేళ్ళలో సొంతం చేసుకుంది.
ప్రస్తుతం హిందీలో ఆమె లీడ్ రోల్ చేస్తున్న సినిమాలు మూడు ఉన్నాయి.అందులో రెండు బయోపిక్ స్టోరీస్ కావడం విశేషం.
ఇక సినిమాలో క్యారెక్టర్ పెర్ఫెక్షన్ కోసం ఎంత హార్డ్ వర్క్ అయిన చేయడానికి వెనుకాడని ఈ అమ్మడు ఇప్పుడు రష్మీ రాకెట్ సినిమా కోసం నిజంగా అథ్లెట్ గా మారిపోతుంది.గ్రౌండ్ లో ప్రతి రోజు పరుగులు పెడుతుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్లిన తరువాత తెలుగు సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గించేంసింది.రొటీన్ కథలని, కమర్షియల్ హీరోయిన్ రోల్స్ ని వదిలేసింది.
ఈ నేపధ్యంలో దర్శకులు కూడా పెర్ఫెక్ట్ క్యారెక్టర్, అది కూడా తాప్సికి సరిపోతుంది అనుకుంటే ఆమెని సంప్రదిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తేజ ప్రస్తుతం గోపీచంద్ తో అలివేలు వెంకటరమణ అనే సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు.
ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది.ఇక ఇందులో హీరోయిన్ గా ముందు కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు.
తరువాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే ఫైనల్ గా ఆ పాత్ర కోసం తేజ తాప్సిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
కథ విన్న తర్వాత పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఒకే చెప్పేసిందని తెలుస్తుంది.త్వరలో చిత్ర యూనిట్ తాప్సి ఎంపికపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక గతంలో గోపీచంద్ తో కలిసి కృష్ణవంశీ దర్శకత్వంలో తాప్సి మొగుడు సినిమాలో నటించింది.ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
తరువాత ఇద్దరూ కలిసి సాహసం సినిమాలో చేశారు.దాని తర్వాత మరల వీరిద్దరి కలయికలో కుటుంబ నేపధ్యంలో అలివేలు వెంకటరమణ సినిమా రావడం విశేషం.
.