బాలీవుడ్ హీరోయిన్ తాప్సి నటించబోతున్న సినిమాకు భీమా చేయించారని, కరోనా భయంతో నిర్మాత భీమా చేయించి మరీ ఈ ప్రమాద సమయంలో షూటింగ్కు వెళ్తున్నాడు అంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.నిర్మాత చేయించే భీమా నటీనటులు టెక్నీషియన్స్ మాత్రమే కాకుండా సినిమాకు నష్టం కాకుండా చూసుకుంటుందని, ఇలాంటి భీమాను చేయించుకుని చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా సేఫ్గా షూటింగ్స్కు వెళ్లవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి కొత్త తరహా భీమా ఇస్తున్నందుకు ఆ భీమా సంస్థను అభినందించాల్సిందే అంటూ అంతా అనుకుంటున్న సమయంలో నిర్మాత అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.తాను భీమా చేయించి షూటింగ్కు వెళ్లబోతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.
అసలు ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ప్రారంభం చేసే విషయంలో ఎవరితోను చర్చలు జరపలేదు.షూటింగ్కు ఇప్పుడు వెళ్లాలని కూడా భావించడం లేదని ఆయన పేర్కొన్నాడు.
తాజాగా తాప్సి ఈ విషయంలో సన్నిహితులతో స్పందిస్తూ ఈ ఏడాదిలో కెమెరా ముందుకు వెళ్లే ఆలోచనే లేదు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా బచ్చన్ ఫ్యామిలీ వంటి వారకే కరోనా వచ్చిన నేపథ్యంలో నేను అస్సలు షూటింగ్స్కు హాజరు కానంటూ పేర్కొంది.
తాప్సి షూటింగ్కు వచ్చే ఏడాది ఆరంభం వరకు వెళ్లే అవకాశం లేదని క్లారిటీ ఇవ్వడంతో ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కూడా సన్నాహాలను ఆపేశారు.