టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యి బాలీవుడ్ లో అడుగుపెట్టి కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి నటిగా తనదైన ముద్ర వేసుకుంటూ వరుసగా లేడీ ఒరియాంటెడ్ కథలతో తాప్సీ దూసుకుపోతుంది.అలాగే ఆమె చేసిన సినిమాలు కూడా వరుసగా హిట్స్ అవుతున్నాయి.
దీంతో బాలీవుడ్ దర్శకులు ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ కథల కోసం కంగనాని పక్కన పెట్టి తాప్సీకి ఓటు వేస్తున్నారు.దీంతో బయోపిక్ కథలు కూడా ఆమె చేతికి వస్తున్నాయి.
గత ఏడాది ఒక బయోపిక్ తో వచ్చిన తాప్సీ ఇప్పుడు గుజరాత్ అథ్లెట్ రష్మీ జీవితం ఆధారంగా దర్శకుడు ఆకర్ష్ ఖురాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రష్మీ రాకెట్’ లో టైటిల్ రోల్ పోషిస్తుంది.ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
గుజరాత్ స్ప్రిన్తర్ రష్మీ తన పరుగుతో ఎన్నో విజయాలను, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.గుజరాత్ ప్రజలు రష్మీని రాకెట్ అని పిలుస్తుంటారు.దీన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు ‘రష్మీ రాకెట్’ పేరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రష్మి పాత్ర కోసం తాప్సీ ఏకకాలంలో నలుగురి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటోంది.
ఒక ట్రైనర్ దగ్గర పరుగు పెట్టడంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరొక ట్రైనర్ దగ్గర ప్రొఫెషనల్ స్ప్రింటర్స్ కి అవసరమైన ఫిట్ నెస్ పై శిక్షణ తీసుకుంటుంది.ఇంకొకరు స్ప్రింటర్స్ తీసుకునే ఫుడ్ హాబిట్స్ పై న్యూట్రీషనిస్ట్ ట్రైన్ చేస్తున్నారు.
అలాగే ఫిజియోథెరపిస్ట్ దగ్గర ట్రైనింగ్ లో గాయాలు కాకుండా ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో తెలుసుకుంటుంది.మొత్తానికి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి తాప్సి ఇంతగా శ్రద్ధ పెట్టడం చూస్తూ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎంత మంచి నటిని మిస్ అయ్యారో అనే విషయం అర్ధమవుతుంది.