టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను.అంతే కాకుండా సొట్ట బుగ్గల సుందరిగా కూడా టాలీవుడ్ లో పిలిపించుకుంది.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది.ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీగా ఉంది.ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది తాప్సీ.
ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది.
ఇక టాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత ఏడాదికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఇక అక్కడే సెటిల్ అయ్యింది.
ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగా ఉంటూ బాలీవుడ్ వైపే అడుగులు వేస్తుంది.మరో కొత్త అవతారాన్ని మొదలుపెట్టింది తాప్సీ.
ప్రస్తుతం ఇండస్ట్రీకి చెందిన నటులంతా కొత్త కొత్త అడుగులు వేస్తున్నారు.చాలా వరకు ఇండస్ట్రీలోనే నటులుగా ఉంటూ.దర్శకులుగా, నిర్మాతలుగా కొత్త బాధ్యతలు చేపడుతున్నారు.ఇక తాజాగా తాప్సీ కూడా ఇదే దారిని ఎంచుకుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్, నెపోటిజం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.నిజానికి వారసత్వం నుండి వచ్చిన వారిని తప్ప బయట వాళ్ళని ఎక్కువగా పట్టించుకోరు.
ఇక తాప్సీ కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే తన సొంత టాలెంట్ తో మంచి ఫామ్ లో ఉందనే చెప్పవచ్చు.ఇక ఈమె మరో కొత్త అవతారంగా నిర్మాతగా మారుతున్నది.ఇక ఈ విషయం గురించి కాస్త ఎమోషనల్ అవుతూ కొన్ని విషయాలు పంచుకుంది.తాను ఇండస్ట్రీకి వచ్చి ఓ దశాబ్దం గడిచిందని, తన ప్రయాణం ఇంత వరకు కొనసాగుతుందని ఊహించుకోలేదని తెలిపింది.
కానీ తాను ఈత నేర్చుకొని.ఇంత వరకు వచ్చాను అంటూ పైగా పబ్లిక్ ఫిగర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది.
తన పనితనం మీద నమ్మకం ఉంచి తనకు అవకాశాలు ఇచ్చినందుకు రుణపడి ఉంటానని తెలిపింది.
అంతేకాకుండా ప్రస్తుతం తను ఎదురుతిరిగే సమయం వచ్చిందని, గొప్ప బాధ్యతలను భుజాన వేసుకున్నప్పుడే మరింత శక్తి వస్తుందని, ఇక తనని ఆశీర్వదించండని తెలిపింది.ఇక తన నిర్మాణ సంస్థ పేరు ‘అవుట్ సైడ్’ అంటూ. అవుట్ సైడ్ నుండి వచ్చే ఆలోచనలు గొప్పగా ఉంటాయని.
ఇక ఈ అవతారంలోకి కొత్తగా అడుగు పెడుతున్నానని తెలిపింది.అవుట్ సైడర్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై కొత్త సినిమాలు నిర్మించబోతున్నట్లు తెలిపింది.