తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన టువంటి ఝుమ్మంది నాదం అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ పన్ను గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.
అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకని కొంతకాలం పాటు హీరోయిన్ గా కొనసాగినప్పటికీ ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలపై మనసు మళ్లడంతో అక్కడికి మకాం మార్చి బాగానే రాణిస్తోంది.
అయితే తాజాగా తాప్సీ పన్ను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.
ఇందులో భాగంగా సినిమా పరిశ్రమ లో ఉన్నటువంటి నెపోటిజం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో ముఖ్యంగా తాను కూడా ఒకప్పుడు నెపోటిజం కారణంగా పలు సినిమా అవకాశాలను కోల్పోయానని, కొందరు దర్శక నిర్మాతలు మొదటగా తనకి సినిమా అవకాశం ఇచ్చిన తర్వాత డబ్బు, పలుకుబడి, బందు ప్రీతి వంటి కారణాలతో తనని తప్పించి ఇతరులకి అవకాశం ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే సినిమా పరిశ్రమలో మనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత మనపైనెపోటిజం ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తాప్సీ పన్ను బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు వినీల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్న హసీనా దిల్ రుబా అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే తమిళ భాషలో కూడా జన గన మణ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
.