సినీనటి సొట్ట బుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే.తన గ్లామర్, నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ ఎన్నో సినిమాలలో అవకాశం అందుకుంది.
తెలుగు, హిందీ, తమిళం సినిమాల్లో కూడా నటించింది తాప్సీ.తన నటన ఫిలిం ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది.
2010లో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయమైంది తాప్సీ.ఈ సినిమాలో తాప్సీ తొలిసారి నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఇక తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది.స్టార్ హీరోల సరసన నటించింది.కానీ తెలుగు సినీ పరిశ్రమలో తన గ్లామర్ కు వచ్చిన గుర్తింపు తెలుగు సినిమాలలో రాలేకపోయింది.
అంతేకాకుండా 2011లో బాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తాప్సీ అక్కడ మంచి విజయాన్ని అందుకోగా.వరుస ఆఫర్ లను అందుకుంది.
బాలీవుడ్ లో ఎక్కువ లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంది.తాప్సీ ఏ పాత్రలోనైనా బాగా నటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ మరో బయోపిక్ సినిమా లో నటించనుంది.ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో ఓ సినిమా చేయనున్నారు.అందులో తాప్సీ ప్రధాన పాత్రలో నటించగా.‘శభాష్ మిథు’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.తాజాగా తాప్సీ బ్యాట్ పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం తాప్సీ బ్యాట్ పట్టుకొని కవర్ డ్రైవ్ వంటి సాంప్రదాయ క్రికెట్ షార్ట్ లను తెగ ప్రాక్టీస్ చేస్తోంది.
భారత మాజీ మహిళా క్రికెటర్ నోషిన్ ఐ ఖాదిర్ శిక్షణ అందిస్తోంది.మిథాలీ రాజ్ భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా చేసి ఇటీవలే రిటైర్మెంట్ కూడా తీసుకుంది.
మొత్తానికి తాప్సీ ఈ సినిమా తో పాటు మరో క్రీడ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘రష్మీ రాకెట్’ అనే సినిమాలో నటించనుంది.మొత్తానికి తాప్సీ మంచి పాత్రలతో అవకాశాలను అందుకుంటూ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.