బాలీవుడ్ లో మంచి ప్రాధాన్యత ఉన్న కథలతో వరుసగా లేడీ ఒరియాంటెడ్ సినిమాలు చేస్తూ హిట్ మీద హిట్ కొడుతున్న ముద్దుగుమ్మ తాప్సి.ఈ అమ్మడు బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది దర్శకులకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.
డిఫరెంట్ కంటెంట్ తో కథలు సిద్ధం చేసుకున్న దర్శకులు మెయిన్ లీడ్ కోసం తాప్సి చుట్టూ తిరుగుతున్నారు.తెలుగులో చాలా సినిమాలు చేసిన సౌత్ లో ఒక్క దర్శకుడు కూడా ఆమెలో గొప్ప నటి దాగి ఉందనే విషయాన్ని గుర్తించలేకపోయారు.
చాలా వరకు ఆమెకి ప్రాధాన్యత లేని పాత్రలు, గ్లామర్ రోల్స్ మాత్రమే ఇచ్చారు.అయితే కెరియర్ బిల్డ్ చేసుకునే క్రమంలో తప్పనిసరి పరిస్థితిలో ఆమె గ్లామర్ రోల్స్ చేయక తప్పలేదు.
కొన్ని సినిమాలలో ఆమె పాత్రలు కేవలం హీరోతో డ్యూయెట్స్ కి పరిమితం అయితే కొన్ని సినిమాలలో కేవలం సెకండ్ లీడ్ గా మిగిలిపోయింది.మంచి కథల కోసం ఓపికగా ఎదురుచూసిన సౌత్ లో అలాంటి సినిమాలలో అవకాశాలు రాకపోవడం ఈ భామ బాలీవుడ్ చెక్కేసి అక్కడి దర్శకులని మెప్పించి మంచి సినిమాలు చేస్తూ వస్తుంది.
ప్రస్తుతం ఆమె హాసన్ దిల్రుబా బాలీవుడ్ చిత్రంతో పాటు జనగణమన తమిళ చిత్రంలో నటిస్తోంది.బాలీవుడ్లో బిజీ అవుతున్న తాప్సీ ఇప్పుడిప్పుడే కెరీర్ ట్రాక్లో వుందని ఇకనుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తానంటోంది.
తన కెరియర్ గురించి తాప్సీ మాట్లాడుతూ పరిశ్రమలో నాకు గాడ్ఫాదర్లు ఎవరూ లేరు.ఎవరిని నమ్ముకొని నేను ఇక్కడికి రాలేదు.
కేవలం నా శక్తి సామర్థ్యాలతోనే నాయికగా ఈ స్థాయికి చేరుకున్నాను.గతంలో పాత్రల ఎంపికలో నేను తీసుకొన్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు నా కెరీర్పై చాలా ప్రభావాన్ని చూపించాయి.
నా పాత్రకు ప్రాధాన్యత లేకున్నా కొన్ని సినిమాల్ని చేయాల్సి వచ్చింది.వాటి వల్ల నటిగా చాలా కోల్పోయాను.
ప్రస్తుతం ఆ తప్పుల్ని సరిదిద్దుకొనే ప్రయత్నాల్లో వున్నాను.ముఖ్యంగా బాలీవుడ్ విషయంలో వాటిని పునరావృతం చేయకూడదని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.
ఆమె మాటల బట్టి టాలీవుడ్ లో తాను చేసిన సినిమాలు ఏవీ కూడా నటిగా తనకి ఎంత మాత్రం ఉపయోగపడలేదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.