టాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా, కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సి.తెలుగులో ఎన్ని సినిమాలు చేస్తున్న నటిగా సంతృప్తి లేకపోవడంతో కమర్షియల్ జోనర్ ని పక్కన పెట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది.
అక్కడ ఎక్కువగా లేడీ ఒరియాంటెడ్ కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ వరుస హిట్స్ కొడుతుంది.దర్శకులు కూడా ఫిమేల్ సెంట్రిక్ కథల కోసం ఎక్కువగా తాప్సి దగ్గరకి వెళ్తున్నారు.
ప్రస్తుతం ఆమె చేతిలో మిథాలీ రాజ్ బయోపిక్ తో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి.అన్ని సినిమాలు నటిగా ఆమెకి గుర్తింపు పెంచేవే కావడం విశేషం.
తెలుగులో కూడా తాజాగా ఓ ఫిమేల్ సెంట్రిక్ థ్రిల్లర్ స్టొరీకి తాప్సి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత ఈ భామ ఓ కొత్త బాయ్ ఫ్రెండ్ ని కూడా వెతుక్కుంది.
డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మతియాస్ బోతో ప్రేమలో ఉందనే వార్తలు బిటౌన్ లో వినిపిస్తున్నాయి.తాప్సి కూడా ఆ మధ్య తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను అనే విషయం పేరు చెప్పకుండానే స్పష్టం చేసింది.
అయితే తాజాగా ఆమె చెప్పకుండానే ఒక్క ఫోటోతో తాప్సి రాకుమారుడు ఎవరనే విషయం తెలిసిపోయింది. బ్యాడ్మింటన్ స్టార్ మతియాస్ బో తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తాప్సి తో సముద్రం దగ్గర కెమెరాకి ఫోజులు ఇస్తున్న ఫోటోని షేర్ చేశాడు.
ఈ ఫోటోలో తాప్సి కూడా మతియాస్ ముందు రొమాంటిక్ స్టిల్స్ ఇచ్చింది.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాప్సి కలల రాకుమారుడు, కాబోయేవాడు ఇతడే అని బిటౌన్ లో చెప్పుకుంటున్నారు.