ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వరుసగా నిజ జీవిత కథలు తెరపైకి వస్తున్నాయి.ఇప్పటికే చాలా కథలు సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.
ప్రస్తుతం చాలా మంది స్పోర్ట్స్ స్టార్స్ కథలని దర్శకులు తెరపై ఆవిష్కరిస్తున్నారు.రీసెంట్ గా హిందీలో విద్యాబాలన్ లీడ్ రోల్ లో శకుంతలాదేవి జీవిత కథ తెరపైకి తీసుకొచ్చారు.
ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.ఇప్పుడు తాప్సి లీడ్ రోల్ లో రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి.
అందులో ఒకటి టెన్నిస్ నేపధ్యంలో రష్మీ రాకెట్ ఒకటి కాగా మరొక సినిమా హైదరాబాదీ స్పోర్ట్స్ స్టార్ ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్.ఈ రెండు సినిమాలలో టైటిల్ రోల్స్ ని ఈ తాప్సి నటిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మీ రాకెట్ సినిమా షూటింగ్ జరుగుతుంది.దీని తర్వాత మిథాలీ బయోపిక్ శభాష్ మిత్తు షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఈ చిత్రానికి రాహుల్ దొలాకియా దర్శకత్వం వహిస్తున్నారు.వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభంకానుంది.ఈ చిత్రం కోసం తాప్సీ మూడునెలల పాటు క్రికెట్ బ్యాటింగ్లో శిక్షణ తీసుకోబోతున్నట్లు తెలిపింది.పాత్రలో పర్ఫెక్షన్ రావాలన్నదే నా తపన.అందుకే మూడు నెలల పాటు క్రికెట్లో కఠోర శిక్షణ తీసుకోబోతున్నా.వచ్చే ఏడాది క్రికెట్ శ్వాసగా జీవించాలనుకుంటున్నా అని తాప్సీ చెప్పింది.
ఇప్పటికే మిథాలీ లుక్ లో తాప్సి ఆకట్టుకుంది.ఇప్పుడు ఆమెలనే క్రికెట్ ప్రాక్టీస్ చేసి బ్యాట్స్ విమెన్ గా తెరపై నటిగా తన సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తుంది.
మొత్తానికి సౌత్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత తాప్సి కెరియర్ ఎన్నడూ లేనంత జోరుగా సాగుతుంది.నటిగా ఒకదానిని మించి ఒకటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.