భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ లటీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.రెండు జట్లు 1-1 తో ఉండగా.
ఇందులో భాగంగా ఆఖరి మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ కానుంది.ఈ కీలక మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.
దీనికోసం ఆదివారం జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ మ్యాచ్ కోసం ఇండియా ఆటగాళ్లు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
వీరికి పార్క్ హయత్ హోటల్ లో, ఆసీస్ ఆటగాళ్లకు హోటల్ తాజ్ కృష్ణలో బస ఏర్పాటు చేశారు.