యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జోడీగా తెరకెక్కుతున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ రాధేశ్యామ్.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.
బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూడో పాన్ ఇండియా మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అలాగే పారిస్ బ్యాక్ డ్రాప్ లో చరిత్రలో నిలిచిపోయే ఓ గొప్ప ప్రేమ కావ్యాన్ని ఈ సినిమాలో రాధాకృష్ణ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకుంది.సినిమా మీద అంచనాలు పెంచేసింది.
ఇదిలా ఉంటే ఈ మూవీ హిందీ రిలీజ్ రైట్స్ ని టి-సిరీస్ సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ కి రీసెంట్ గా ఒక రిక్వస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది.
రాధేశ్యామ్ లో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేయాలని కోరారు.ఈ సాంగ్ కి సినిమాలో అవకాశం లేకపోయినా చిత్ర ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
దీంతో దర్శకుడు రాధాకృష్ణ, ప్రభాస్ ఆలోచించి రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ పాటని కథకి అనుగుణంగా ఉండే విధంగా సిద్ధం చేయాలా లేదంటే ట్రెండీగా కేవలం ప్రమోషన్ సాంగ్ మాదిరి ప్లాన్ చేయాలా అనే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడని తెలుస్తుంది.
దీనిపై క్లారిటీ చూసుకొని లాక్ డౌన్ అనంతరం ఈ సాంగ్ ని చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం.