టాలివుడ్ ఇండస్ట్రీలోకి గంగోత్రి సినిమాతో తన సినీ హీరో వస్తానని మొదలుపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.అలాగే ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన, తన కుటుంబానికి విషయాలను తెలియజేస్తూ అభిమానులకు మరింత దగ్గర అయిపోతున్నాడు బన్నీ.
ఇది ఇలా ఉండగా సినీ ప్రముఖుల గురించి ఎప్పుడోకప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ చర్చలు కొనసాగిస్తూ ఉంటాయి.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా ఇప్పటికి రిలీజ్ అయ్యి సంవత్సరం అవుతుంది కానీ.
ఆ సినిమాకు క్రేజ్, ట్రెండ్ మాత్రం అలానే ఉంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా అనంతరం బన్నీ – సుకుమార్ డైరెక్షన్ తో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇదిలా ఉండగా మరోవైపు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి మరొక వార్త అభిమానులను బాగా ఆసక్తి రేపుతోంది.
తాజాగా బన్నీ తన అభిమానులకు, సోషల్ మీడియా ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.ఇంతకీ ఎందుకు అని ఆలోచిస్తున్నారా.?! అదేనండి తాజాగా అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లకు చేరుకొంది.దీనితో సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, ఫాలోవర్స్ కు ఓ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఈ పోస్టుకు ఎల్లప్పుడూ నాకు మీ బ్లెస్సింగ్స్ అందచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ తెలిపాడు బన్నీ.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.అలాగే వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు బన్నీ. పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు ఐదు భాషల్లో రిలీజ్ కావడంతో అభిమానులతో పాటు సిని రంగాలలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.