నేడు దేశం అంతా ఘనంగా 74 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలు జరుపుకుంటున్నారు.వారికి వీలునుబట్టి దగ్గరలో జరుగుతున్న వేడుకల్లో చాలామంది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే… స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నేడు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతుల పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ స్వాతంత్ర సమరయోధుల గెటప్ లో కనిపించి అందరిని అలరించారు.
ఇక అల్లు అయాన్.
తన తాతయ్య నటించిన సైరా నరసింహారెడ్డి లో చిరంజీవి నటించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ వేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.ఇక అల్లు అర్హ స్వాతంత్ర సమరయోధుడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్య గెటప్ లో మైమరిపించింది.
ప్రస్తుతం వీరి ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా కొనసాగుతున్నాయి .
ఈ సందర్భంగా అల్లు అర్హ తాను వేసిన గెటప్ తో సత్యమేవ జయతే అంటూ నినాదాలు చేసింది.అల్లు అయాన్ కూడా ‘ సై సైరా ‘ అంటూ ఇచ్చిన ఫోజు నిజంగా సూపర్.ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ తన పిల్లలు చేసే అల్లర్లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు.
ఇదివరకు సంక్రాంతి కానుకగా విడుదలైన అలా వైకుంఠపురం లో అల్లు అర్జున్ చేసిన స్టెప్ దోశ స్టెప్ చేసావంటూ అల్లరి చేసిన అల్లు అర్హ వీడియో అందరికీ గుర్తు ఉంటే ఉంటుంది.ఏది ఏమైనా స్వాతంత్ర దినోత్సవం రోజు అల్లు వారసులు స్వాతంత్ర సమరయోధుల గెటప్ లో ఒరిగిపోయారు.