మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో రిలీజ్ చేశారు.
ఈ సినిమాను ప్రెస్టీజియస్గా తీసుకున్న మెగాస్టార్ అంతే ప్రెస్టీజియస్గా రిలీజ్ చేశారు.ఈ సినిమాను భారీ బడ్జెట్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించాడు.
కాగా సైరా చిత్రం తాజాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.సినిమా థియేటర్ల నుండి వెళ్లిపోయి చాలా రోజులు అయ్యింది, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది.
ఇప్పుడు కొత్తగా సెన్సేషన్ ఎలా క్రియేట్ చేసింది అనుకుంటున్నారా? తమిళంలో ఈ సినిమాను ఇటీవల టెలివిజన్ ప్రీమియర్ చేశారు.ఈ ప్రీమియర్కు ఏకంగా 15.4 టీఆర్పీ వచ్చింది.ఇది తమిళంలో సెన్సేషన్ అని అంటున్నారు అక్కడి మీడియా జనం.
ఏదేమైనా మెగాస్టార్ ప్రెస్టీజియస్గా తీసుకున్న సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ తనదైన మార్క్ వేసింది.మరి తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి టీఆర్పీతో రికార్డు సృష్టిస్తుందో చూడాలి అంటున్నారు తెలుగు ఆడియెన్స్.
సైరా తెలుగు ప్రీమియర్ ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.