మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి.ఈ సినిమా మీద టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.
మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ ఇండియా స్టార్ హీరోలతో పాటు, బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలో నటించాడు.దీంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనే కసితో నిర్మాత రామ్ చరణ్ ఉన్నాడు.
ఇప్పటికే చాలా వేగంగా జరుగుతున్నా ఈ సినిమా షూటింగ్ తాజాగా కొన్ని సెట్స్ నిర్మాణం కారణంగా కొంత గ్యాప్ తీసుకుంది.
ఇప్పుడు కోకాపేట్ లో వేసిన భారీ కోట సెట్స్ లో షెడ్యూల్ కి రెడీ అవుతుంది.ఈ కోటలో ఏకంగా 11 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైన ద్రుష్టి పెట్టాలని, ఈ సినిమాతో గట్టిగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే సురేందర్ రెడ్డి కి రామ్ చరణ్ ఇప్పటికే చెప్పడం జరిగిందని తెలుస్తుంది.దీంతో ఈ సినిమా కోసం రాత్రి పగలు అనకుండా దర్శకుడు సురేందర్ పనిచేస్తున్నాడని తెలుస్తుంది.
మరి వేల మంది కష్టంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులని ఎ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో వేచి చూడాలి.