మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన నుండి రాబోతున్న తర్వాత సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి.చిరు 150వ చిత్రం విడుదలైన ఆరు నెలల్లోనే కొత్త సినిమాతో వస్తాను అంటూ ఫ్యాన్స్కు అప్పుడు మాట ఇచ్చాడు.కాని ఆ మాటపై చిరంజీవి నిలబడలేక పోయాడు.ఖైదీ నెం.150 సినిమా విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత కూడా ఆయన 151వ చిత్రం విడుదల అయ్యే అవకాశం లేదని తేలిపోయింది.ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్లో జరుపుతున్నారు.
చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి సంవత్సర కాలం చర్చలు జరిపి ఎట్టకేలకు గత సంవత్సరం చివర్లో సెట్స్ పైకి తీసుకు వెళ్లారు.అయితే కొన్ని కారణాల వల్ల సినిమా మెల్లగా చిత్రీకరణ జరుపుకుంటుంది.భారీ స్థాయిలో అంచనాలున్న సైరా నరసింహారెడ్డిలో ప్రముఖ స్టార్స్ నటిస్తున్న కారణంగా వారి డేట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి.అందుకే షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.మొత్తానికి చిరంజీవి 151వ చిత్రం విడుదల ఇప్పట్లో లేదని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.సినిమా విడుదల ఆలస్యం వెనుక పబ్లిసిటీ స్టంట్ ఉందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.
‘బాహుబలి’ సినిమాను రాజమౌళి ఏకంగా అయిదు సంవత్సరాలు తెరకెక్కించాడు.సినిమా ఎంత ఆలస్యం అయితే అంతగా అంచనాలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో చిరు సినిమాను ఆలస్యం చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొదట సైరాను ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయాలని భావించారు.ఆ తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సైరా మూవీని వచ్చే సంవత్సరం వేసవి ఆరంభంలో విడుదల చేస్తామని చెబుతున్నారు.ఇలా సినిమాను దూరం పెంచుతున్న కొద్ది సినిమాకు పబ్లిసిటీ పెరగడంతో పాటు, భారీ క్రేజ్ దక్కుతుందని, అలా దక్కితే రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అవుతుందనేది వారి ఆలోచనగా తెలుస్తోంది.
మెగాస్టార్ మూవీని ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబచ్చన్తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరియు కన్నడకు చెందిన ప్రముఖ హీరో కూడా కనిపించబోతున్నాడు.
మయాళంకు చెందిన స్టార్స్ కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.తమన్నా, నయనతారలు ఈ చిత్రంలో ఆకట్టుకోబోతున్నారు.మొత్తానికి సైరా నరసింహారెడ్డి చిత్రం ఓ రేంజ్లో మెప్పింస్తుందని అనిపిస్తుంది.ఆలస్యం అయినా కొద్ది సినిమాపై ఆసక్తి అందరికి పెరుగుతుంది.