మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.భారతదేశపు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధను సినిమాగా తెరకెక్కించాలనేది చిరు కల.
ఆ కలను దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి నిజం చేశాడు మెగాస్టార్.
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని భారీ బడ్జెట్తో నిర్మించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమాలో వావ్ అనే అంశాలు ఏమీ లేకపోవడంతో అనుకున్న స్థాయిలో మాత్రం సినిమా సక్సెస్ కాలేదనే చెప్పాలి.కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమాకు ప్రజాదరణ లభించింది.2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
కాగా తాజాగా ఈ సినిమా ఎమ్మిగనూరులో నేరుగా 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని అందరికీ షాకిచ్చింది.ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫాంలో ఎప్పుడో రిలీజ్ అయినా ఎమ్మిగనూరులో ఇంకా ప్రదర్శితమవుతోంది.
మెగాస్టార్ చిరు సైరా సినిమా 100 రోజులు పూర్తి చేసుకుందనే వార్త మెగా ఫ్యాన్స్కు కూడా తెలియకపోవడం గమనార్హం.