విదేశాలలో ఉన్న బ్యాంకుల్లో అక్రమంగా దాచుకున్న నల్లదనాన్ని ఇండియాకి రప్పిస్తానని మోడీ ఇచ్చిన మాట సఫలం అయ్యేలా కనిపిస్తోంది.తమ దేశంలో బ్యాంకుల్లో అక్రమంగా దాచుకున్న భారతీయులపై ఒత్తిడి తెస్తోంది స్విస్ బ్యాంక్.
ఈ మేరకు తాజాగా ఓ భారతీయుడికి నోటీసులు పంపింది.పొట్లూరి రాజమోహన్ రావు అనే పారిశ్రామికవేత్తకు ఈ మేరకు నోటీసులు అందాయి.
ఆ నోటీసులో మీ బ్యాంక్ ఖాతా వివరాలు భారత ప్రభుత్వానికి చెప్పేందుకు ఏమయినా అభ్యంతరాలు ఉన్నాయా, ఒక వేళ ఉంటే, పది రోజుల్లో అప్పీల్ చేసుకోవాలని స్విట్జర్లాండ్కు చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ నోటీసుల్లో తెలిపింది.అయితే ఈ మేరకు గత నెల 28 న రాజమోహన్ రావు అనే వ్యక్తికి నోటీసులు అందినట్టుగా సమాచారం.కానీ అతడు ఎవరు, ఎక్కడ ఉంటారు అనే వివరాలు మాత్రం సదరు సంస్థ వెల్లడించలేదు.
రాజమోహన్ రావు అనే పేరు, అతడి పుట్టిన తేదీ, అనే వివరాలు తప్ప మరేవీ తెలియరాలేదు.
అంతేకాదు గత నెల 21న కూడా తమ బ్యాంకుల్లో అనుమానాస్పదం గా ఉన్న సుమారు 11 మంది భారతీయులకు చెందిన ఖాతాలకి స్విస్ బ్యాంక్ ఇలాంటి నోటీసులో జారీ చేసింది.ఇదిలాఉంటే రాజమోహన్ అనే వ్యక్తి బెంగుళూరు కి చెందిన వ్యాపారవేత్త అని మాత్రం స్పష్టం అయ్యిందని తెలుస్తోంది.