ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలవరీ దందాలు భారీగా పెరిగి పోయాయి.ఇండియాలో జొమాటో మరియు స్విగ్గీలు రాజ్యం ఏళుతున్నాయి.
ఈ రెండు కూడా దేశంలో దాదాపుగా 85 శాతం మార్కెట్ను కలిగి ఉన్నాయి.చిన్న పెద్ద అనే తేడా లేకుండా పట్టణాలు మరియు నగరాల్లో ఈ సంస్థలు స్వేలు అందిస్తున్నాయి.
అయితే ఈ సంస్థలు హోటల్స్ నుండి మరియు వినియోగదారుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తోంది.దాంతో హోటల్స్ మరియు వినియోగదారులు ఈ యాప్స్తో విసిగి పోతున్నారు.
విజయవాడలో ఏకంగా స్విగ్గీని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చింది.విజయవాడలో స్విగ్గీ సేవలు ప్రారంభించినప్పుడు జీరో పర్సంటేజ్తో హోటల్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఆ తర్వాత 5 శాతం కమీషన్ను పెంచారు.అది కాస్త 10 శాతంకు పెంచారు.
భారీగా ఆర్డర్స్ వస్తున్న కారణంగా హోటల్స్ నుండి ఏకంగా 25 శాతం వాటాను స్విగ్గీ తీసుకునేందుకు సిద్దం అయ్యిందట.అందుకే విజయవాడ హోటల్స్ అన్నీ కలిసి స్విగ్గీని బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి.
పది లేదా పదిహేను శాతం వరకు కమీషన్ ఇచ్చి వ్యాపారం చేసేందుకు ఓకే అంటున్నాయి.కాని స్విగ్గీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.