మరోసారి వార్తల్లోకెక్కిన "శ్వేతా బసు ప్రసాద్".! ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా.?

శ్వేతా బసు ప్రసాద్.కొత్త బంగారులోకం సినిమాతో టాలివుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఆ సినిమాలో నటనతో అందరిని ఆకట్టుకుంది.బాలనటిగా బాలివుడ్లో కెరీయర్ ప్రారంభించింది శ్వేత.

కెరీర్ ప్రారంభంలోనే సినిమా హీరోయిన్లు పడే కష్టాలన్ని పడింది.అవకాశాలు లేక వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది.

అప్పుడప్పుడే కెరీర్లో ఎత్తుపల్లాలు చూసి ఒకేసారి గట్టి దెబ్బే తిన్నది ఈ సంఘటనతో శ్వేత…అప్పుడు మహిళాసంఘాలు అందరూ శ్వేతకే మద్దతు తెలిపాయి.

ఆ సంఘటన తర్వాత ఒకసారిగా గోడకు కొట్టిన బంతిలా లేచింది శ్వేత చంద్రనందిని సీరియల్ తో.తన నటన ద్వారా మరొకసారి ప్రేక్షకుల మన్ననలు పొందింది.ఇప్పుడు శ్వేతాబసు ప్రసాద్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది.

ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనుకుంటున్నారా? వివరాలు మీరే చూడండి.

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను ఆమె వివాహం చేసుకోనుంది.కొన్ని రోజుల క్రితమే తమ నిశ్చితార్థం జరిగినట్టు శ్వేత స్వయంగా ప్రకటించింది.గోవాలో రోహిత్ కు తానే ప్రపోజ్ చేశానని, ఆ తర్వాత పూణెలో తన ప్రేమను రోహిత్ అంగీకరించాడని తెలిపింది.

ఇంట్లోవాళ్లు కూడా తమ ప్రేమను అంగీకరించారని చెప్పింది.

అయితే, తమ ఇద్దరి జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చెప్పుకోవాలని తాము భావించడం లేదని తెలిపింది.పెళ్లి ప్రస్తావనను అబ్బాయిలు మాత్రమే తెచ్చే రోజులు పోయాయని, ఇప్పుడు అమ్మాయిలు కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారని చెప్పింది.ప్రస్తుతం శ్వేత ఓ బాలీవుడ్ చిత్రంతో పాటు తెలుగులో ‘గ్యాంగ్ స్టర్స్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube