తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.అయితే భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇక ఆ తరువాత కేసీఆర్ పై ఈటెల పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే ఈటెల స్వంత నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఈటెల హవాను తగ్గించడానికి ఇప్పటికే కేసీఆర్ వ్యూహ రచన చేసిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఈటెల వెంట టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లకుండా ఒంటరిని చేయాలన్నది కేసీఆర్ ప్రధాన వ్యూహం.కేసీఆర్ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మంత్రి గంగుల చెమటోడుస్తున్నాడని చెప్పవచ్చు.
అయితే ఇప్పటికే హుజూరాబాద్ నేతలతో మాట్లాడుతున్న గంగుల టీఆర్ఎస్ లో కొనసాగడం వల్ల భవిష్యత్ లో జరిగే లాభాలను వివరిస్తూ నేతలకు మంత్రి గంగుల కమలాకర్ బ్రెయిన్ వాష్ చేస్తున్న పరిస్థితి ఉంది.ఈటెల రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని, త్వరలో మీకు మంచి రోజులు వస్తాయనే ఆశాభావాన్ని వాళ్లకు కలిగిస్తున్నాడు మంత్రి గంగుల.
అధినేత కేసీఆర్ మనసు దోచుకోవడానికి హుజురాబాద్ పరిస్థితులపై కేసీఆర్ సంతృప్తి చెందే దిశగా మంత్రి గంగుల కమలాకర్ తన కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.