ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మళ్లీ కొత్త సంవత్సరాన్ని చూడటానికి ఎందరు మిగిలి ఉంటారో తెలియని అయోమయ పరిస్దితి ప్రజల్లో నెలకొంటుందట.ఇప్పటికే సామాన్యులతో పాటుగా ప్రముఖులకు కూడా ప్రాణాంతకంగా మారిన, ఈ వైరస్ కాస్త కూడా జాలి చూపించకుండా నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలను తీస్తుంది.
,/br>
ఇప్పటికే ఎందరినో తన కాటుకు బలి చేసిన కోవిడ్ సెకండ్ వేవ్ తాజాగా స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మణిచందనను కూడా కబళించింది.ఇకపోతే స్వాతి పబ్లిషర్ మరియు ఎడిటర్ అయిన శ్రీ వేమూరి బలరాం గారి కుమార్తెగా మణిచందన స్వాతి నిర్వహణ లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
అయితే గత ఏడాదిగా ఆమె కాన్సర్ తో పోరాడుతున్నారు.ఇలాంటి నేపధ్యం లో వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన మణిచందనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక పోయారు.
చివరికి విధి చేతిలో ఓడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.