విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఏపీలో నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే.వైసీపీ నేతలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తున్నారు.
ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా ప్రతి ఘటిస్తున్నాయి.కానీ కేంద్రం మాత్రం నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే చందాగా వ్యవహరిస్తుంది.
ఇక ఈ అంశం పై విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపనందేంద్రస్వామి మొదటిసారిగా స్పందించారు.విశాఖ ఆర్.కె బీచ్ వద్ద టి.సుబ్బరామిరెడ్డి శ్రీ లలితా కళా పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివరాత్రి ఉత్సవాల్లో స్వరూపనందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మ నందేంద్ర స్వామి పాల్గొన్న క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేట్పరం కానివ్వమని గురుశిష్యులైన స్వాములిద్దరూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది.
అదీగాక విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రయివేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, దీని వల్ల ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుందని వెల్లడించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.