రెండు మల్టీస్టారర్ చిత్రాలకు టెండర్ వేసిన డైరెక్టర్

గతేడాది రిలీజ్ అయిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ బాక్సాఫీస్ వద్ద ఎవ్వరి ఊహలకు అందకుండా విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు యంగ్ డైరెక్టర్ స్వరూప్.

 Allu Arjun, Ntr, Prabhas, Aamir Khan, Swaroop Rsj, Agent Sai Sreenivas Athreya-TeluguStop.com

ఒక్క సినిమాతో ప్రేక్షకులను మెప్పించంలో సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్.అయితే తనకు ఎప్పటినుండో రెండు మల్టీస్టారర్ చిత్రాలను తెరకెక్కించాలని ఉందని స్వరూప్ తెలిపాడు.

టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ఎప్పటికైనా తెరకెక్కించాలని ఆయన కోరుతున్నాడు.కాగా పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లతో కలిసి మరో మల్టీస్టారర్ మూవీ కూడా చేయాలని ఈ డైరెక్టర్‌కు ఉందట.

అయితే ఇప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్న ఈయన ఈ రెండు సినిమాలను ఎప్పుడు తెరకెక్కిస్తాడో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ చిత్రానికి సీక్వెల్ కథను రెడీ చేస్తున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube