గతేడాది రిలీజ్ అయిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ బాక్సాఫీస్ వద్ద ఎవ్వరి ఊహలకు అందకుండా విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు యంగ్ డైరెక్టర్ స్వరూప్.
ఒక్క సినిమాతో ప్రేక్షకులను మెప్పించంలో సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్.అయితే తనకు ఎప్పటినుండో రెండు మల్టీస్టారర్ చిత్రాలను తెరకెక్కించాలని ఉందని స్వరూప్ తెలిపాడు.
టాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ఎప్పటికైనా తెరకెక్కించాలని ఆయన కోరుతున్నాడు.కాగా పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్లతో కలిసి మరో మల్టీస్టారర్ మూవీ కూడా చేయాలని ఈ డైరెక్టర్కు ఉందట.
అయితే ఇప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్న ఈయన ఈ రెండు సినిమాలను ఎప్పుడు తెరకెక్కిస్తాడో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ చిత్రానికి సీక్వెల్ కథను రెడీ చేస్తున్నాడట.