భోపాల్లో జరిగిన కాంగ్రెస్ సేవాదళ్ జాతీయ శిక్షణ శిభిరంలో వాలింటీర్లకు పంపిణీ చేసిన పుస్తకాల్లో గాంధీని చంపిన గాడ్సే మరియు వీర సావర్కర్లు స్వలింగ సంపర్కులు అంటూ ముద్రించడం జరిగింది.గాడ్సే మరియు సావర్కర్ల గురించి అందులో పలు షాకింగ్ విషయాలను వెళ్లడించడం జరిగింది.
దాంతో పలు హిందూ సంస్థలు మరియు ప్రముఖులు ఆ పుస్తకంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.రాహుల్ గాంధీపై కూడా కొందరు ఎదురు దాడిని ప్రారంభించారు.
ఈ సందర్బంగానే స్వామి చక్రపాణి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గాడ్సే మరియు సావర్కర్లకు లైంగిక సంబంధంను అంటగట్టి వారు స్వలింగ సంపర్కులు అంటూ ప్రచారం చేయడం చాలా దారుణం అన్నాడు.ఆ మాటకు వస్తే తాను గతంలో రాహుల్ గాంధీ కూడా ఒక స్వలింగ సంపర్కుడు అనే విన్నాను.
ఆయన కూడా గతంలో కొందరు సహాయకులతో స్వలింగ సంపర్కం చేశారని నేను తెలుసుకున్నాను అన్నాడు.స్వామి చక్రపాణి చేసిన విమర్శలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండి పడుతున్నారు.
ఈ వివాదంలోకి రాహుల్ గాంధీని లాగాల్సిన అవసరం ఏంటీ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి ఈ విషయం రచ్చ రచ్చ అవుతోంది.