మంచిగా ఆధ్యాత్మికంగా నాలుగు మాటలు చెబితే చాలు స్వామిజీ లు అయిపోతున్నారు.కాషాయ వస్త్రాలు ధరించి భక్తులను సన్మార్గంలో నడుపుతాం అంటూ వారే తప్పుడు పనులు చేస్తూ ప్రజలకు దొరికిపోతున్నారు.
అయితే ఎన్ని ఇలాంటి ఘటనలు జరిగిన ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.వారు కాకపోతే,వేరువారు ఇలా స్వామిజీ లనే నమ్ముకుంటూ జీవిస్తున్నారు.
కర్ణాటక లో కూడా చాలా మంది ప్రజలు దేవుడి స్వరూపం అంటూ ఒక స్వామిజీ ని విపరీతంగా కొలుస్తూ వచ్చారు.అయితే ఆయన గారు మాత్రం మనసులో కామ ఆలోచన పెట్టుకొని ప్రజలకు తత్వం బోధిస్తూ పబ్బం గడుపుకుంటూ వచ్చాడు.
అయితే ఆయనగారి అసలు రంగు ఇప్పుడు బయటపడింది.తత్వం బోధించాల్సిన ఆయన కామ ఆలోచనలతో ఒక యువతిని తీసుకొని అక్కడ నుంచి పరార్ అయిపోయాడు.
వివరాల్లోకి వెళితే… కర్ణాటక లోని కోలార్ జిల్లా లో విజయపుర జిల్లా ముద్దేబిహాళ్కు చెందిన దత్తాత్రేయ అవధూత రెండు నెలల క్రితం హొళలి గ్రామానికి వచ్చాడు.
అయితే ఒంటిపై కాషాయం దుస్తులు, గుబురు గడ్డంతో ఉన్న అతడు దేవుని స్వరూపమని తత్వం బోధిస్తూ గ్రామస్తులను నమ్మించాడు.
దీనితో గ్రామంలోని భీమలింగేశ్వర ఆలయంలో పూజారిగా ఉంటానని చెప్పడం తో గ్రామస్తులు నమ్మి సరే అన్నారు.ఆ తరువాత తత్వం బోధిస్తూ త్వరలోనే ఆశ్రమాన్ని స్థాపించి గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానంటూ తెగ కబుర్లు చెప్పాడు.
దీనితో నమ్మిన గ్రామస్తులు రోజూ ఆయనకు పాద పూజలు చేయడం మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే ఒక 20 ఏళ్ల భక్తురాలు స్వామి వారికి పాద పూజకోసం అని రోజూ వచ్చేది.
అయితే ఆమెపై కన్నేసిన ఆ దొంగస్వామి ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.ఆ యువతి శివరాత్రి రోజు స్వామీజీకి పాదపూజ చేసి వస్తానని వెళ్లి ఇంటికి తిరిగిరాకపోవడం తో ఆందోళన పడిన కుటుంబసభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.
అయినా లాభం లేకపోవడంతో ఆందోళన చెందారు.అయితే అదే సమయంలో స్వామీజీ కూడా కనిపించడం లేదని తెలియడంతో గ్రామస్తులకు అనుమానం కలిగింది.అయితే ఆ యువతి సోదరుడికి ఆ దొంగ స్వామి ఫోన్ చేసి తిరుపతి లో పెళ్లి చేసుకున్నామని త్వరలోనే గ్రామానికి తిరిగి వస్తాం అంటూ సెలవిచ్చాడు.దానితో దొంగస్వామి బండారం బయటపడింది.
కాషాయం ముసుగులో గ్రామస్తులను మోసం చేసి ఒక యువతిని తీసుకొని పారిపోయేవరకు కూడా అతడి అసలు రంగు కనిపెట్టలేకపోయాం అంటూ గ్రామస్తులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.