ప్రొఫెసర్ల వేధింపులతో జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
తిరుపతి శివజ్యోతినగర్కు చెందిన గీతిక ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
ఆదివారం మధ్యాహ్నం తల్లితో కలిసి భోజనం చేసిన గీతిక అనంతరం తన గదిలోకి వెళ్లిపోయింది.
సాయంత్రం ఆమెను నిద్ర లేపేందుకు తల్లి ప్రయత్నించగా ఎంతకూ గది తలుపులు తీయలేదు.దీంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది.పక్కింటి వారి సాయంతో గది తలుపులు తెరిచి గీతికను ప్రభుత్వ రుయా ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు.అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
పర్సనల్ కారణాల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి చెప్పినప్పటికీ అదొక మిస్టరీ లాగే మిగిలింది…ఇంతలో గీతికా ఆత్మహత్యకిముందు రాసిన సూసైడ్ నోట్ బయటపడింది.అందులో ఏం రాసుంది అంటే.?
‘అమ్మా.నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు.
ఎందుకో అమ్మా ఇక నాకు బతకాలని లేదు.నాకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదమ్మా.
అందరి గురించి ఆలోచించి, అందరు అమ్మాయిల్లాగా నాకూ భర్త, కుటుంబం.అతని ప్రేమ కావాలనుకున్నా.
కానీ, నా జీవితంలో నేను ఓడిపోయానమ్మా.తను లేకుండా బతకలేను.
కనీసం నా జీవితం కోసమైనా తనను ఏమీ చేయకమ్మా.నన్ను క్షమించు అమ్మా.
నేను పిరికిదాన్ని కాదమ్మా.కానీ, నాకు వేరే దారి కనిపించలేదు.
తను లేకుండా బతకలేను.అలా అని తనతో కలిసి బతకలేను.
అందుకని వెళ్లిపోతున్నాను.నన్ను క్షమించండి.
’ అని రాసి ఉంది.