సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది.ఇలాంటి సంఘటనలు సమాజంలో తరచుగా చోటుచేసుకోవడం గమనార్హం.
ఇందుకు ముఖ్యంగా సమాజంలో ఏ బంధానికైనా ఉన్న విలువను గుర్తించి, జీవితం పట్ల జవాబుదారీతనంతో, సమాజ కట్టుబాట్లను పాటించకపోవడం వల్ల జరిగే అనర్థాలను గుర్తించి, మనిషి కుటుంబ మనుగడలో వచ్చే కొద్దిపాటి ఒడిదుడుకులను.సమయస్ఫూర్తితో ఒకరినొకరు అర్థం చేసుకొని.
, ఓర్పు, సహనం వహించి.మెలిగితే తప్పకుండా భావి జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు.
కానీ ఆధునిక సమాజంలో మితిమీరి పోయిన పాశ్చాత్య నాగరికత వల్ల అనర్థాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ లో ఒక వ్యక్తి తన భార్య పై అనుమానంతో, భార్య తల నరికి అతి కిరాతకంగా హతమార్చాడు.
సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.జుర్రు సాయిలు, అంశమ్మ అను భార్య భర్తలు అనంతసాగర్ లో కాపురం ఉంటున్నారు.అంశమ్మ కు గత కొంత కాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని సాయిలు అనుమానిస్తున్నాడు.ఈ క్రమంలో ఆమెతో చాలా సార్లు గొడవ పడ్డాడు.
బుధవారం రాత్రి సైతం భార్యతో గొడవ పడి విచక్షణ కోల్పోయి గొడ్డలితో దాడి చేశాడు.అతి కిరాతకంగా శరీరం నుంచి తలను వేరు చేసి, అనంతరం మొండెం ను ఇంటి సమీపంలో పడేసి, తలను నారాయణఖేడ్ తీసుకెళ్లి అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి గుమ్మం ముందు ఉంచాడు.
ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.