రాధేశ్యామ్‌లో ఆ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Suspense Continues In Radhe Shyam, Radhe Shyam, Prabhas, Tollywood News, Pooja H-TeluguStop.com

కాగా ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే.

ఈ పోస్టర్స్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక అందాల భామ పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో అదిరిపోయే లుక్‌లో మనకు కనిపించింది.అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లో ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు అనే అంశంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.దీంతో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం సస్పెన్స్‌గా మారిపోయింది.

కానీ ఇప్పటివరకు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఈ సినిమా కోసం ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మరి ఈ సినిమాకు సంగీతం ఎవరి ఇస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube