భారత్ -పాకిస్థాన్ సరిహద్దులో డ్రోన్ సంచారం కలకలం రేపింది.పాకిస్థాన్ కు ఆనుకుని ఉన్న భారత సరిహద్దులో అనుమానిత డ్రోన్ ప్రవేశించింది.
అప్రమత్తమైన సరిహద్దు భద్రతా బలగాలు అమృతసర్ సెక్టార్ లో డ్రోన్ ను ప్రవేశించినట్లు గుర్తించారు.అనంతరం ఆ అనుమానిత డ్రోన్ ను రాత్రి 8.30 గంటల సమయంలో బీఎస్ఎఫ్ కూల్చివేసింది.డ్రోన్ ద్వారా రవాణా చేస్తున్న వస్తువులను, పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత డ్రగ్స్ స్మగ్లింగ్ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఈ సందర్బంగా బీఎస్ఎఫ్ వెల్లడించింది.కాగా ఈ సరిహద్దుల్లో గత మూడు రోజుల్లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండో సారి కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో పాక్ నుంచి డ్రోన్లు భారత సరిహద్దుల్లోకి ప్రవేశిస్తుండటంతో అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.