బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ మృతి తరువాత ఆయన ఆత్మహత్య కేసు అనేక మలుపులు తీసుకున్న సంగతి విదితమే.సుశాంత్ కేసులో డ్రగ్స్ గురించి వెలుగులోకి రావడంతో చాలామంది హీరోయిన్ల కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కొన్ని రోజుల క్రితం బెయిల్ పై విడుదల కాగా రియా సోదరుడు షోవిక్ కు మాత్రం బెయిల్ రాలేదు.అయితే తాజాగా సుశాంత్ సోదరి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సుశాంత్ మృతి గురించి కీలక పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా సుశాంత్ అభిమానులకు ప్రతి విషయానికి సంబంధించి కీలక సమాచారాన్ని తెలియకేస్తున్న శ్వేతా సింగ్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకుని ఆమె ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను డిలేట్ చేశారు.
శ్వేతా సింగ్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం గురించి సుశాంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.శ్వేతా సింగ్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించడం వెనుక ఎవరైనా ఉన్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటితో సుశాంత్ మృతి చెంది నాలుగు నెలలైంది.శ్వేతా సింగ్ స్పందిస్తే మాత్రమే ఆమె అకౌంట్లు డిలేట్ చేయడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.
నిన్న “నిజమైన ప్రేరణ” అంటూ ఒక వీడియోను షేర్ చేసిన శ్వేతా సింగ్ ఆ తరువాత సోషల్ మీడియా ఖాతాల నుంచి నిష్క్రమించారు.మరోవైపు సుశాంత్ మృతి కేసులో ఎన్సీబీ, సీబీఐ అధికారులతో పాటు ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
సుశాంత్ కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వల్ల సుశాంత్ కేసు దర్యాప్తు పక్కదారి పడుతోందని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.