సుశాంత్ మరణం గురించి అనేక అనుమానాలు ఉన్నాయి.ఈ విషయంలో బాలీవుడ్ మొత్తం చర్చించుకుంటున్నారు.
ఆత్మహత్య అంటూ మొదట ప్రచారం జరిగినా కూడా అది ఖచ్చితంగా హత్య అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు.ముఖ్యంగా సుశాంత్ సన్నిహితులు ఆయన్ను దగ్గరగా చూసిన వారు ఇది హత్య అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు.
సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇప్పటికే బీహార్ పోలీసులకు రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసు పెట్టాడు.తాజాగా సుశాంత్ది హత్య అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ డాక్టర్ మీనాక్షి మిశ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
చర్మ వైధ్య నిపుణురాలు అయిన మీనాక్షి మిశ్రకు సుశాంత్తో చాలా కాలంగా పరిచయం ఉందట.ఆమె సుశాంత్ మృతి చెందిన సమయంలో తీసిన ఫొటోలను పరిశీలించగా ఆయన మొహంపై గాయాలు ఉన్నాయట.
అలాగే శరీరంపై కూడా తేలికపాటి గాయాలు ఉన్నాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేసింది.అంటే సుశాంత్ను ఎవరైనా కొట్టి చంపి ఉంటారు అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది.
సుశాంత్ను కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి అయినా ఉందా అనే విషయాన్ని పోలీసులు ఎంక్వౌరీ చేస్తే బాగుంటుంది అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆమెను విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని బీహార్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.కాని ఆమె మాత్రం దొరడం లేదు.
పోలీసులు హెచ్చరించినా కూడా ఆమె మాత్రం బయటకు రావడం లేదు.సుప్రీం కోర్టులో బీహార్ పోలీసుల వద్ద విచారణకు తాను హాజరు కాను అంటూ పిటీషన్ వేసింది.
దీంతో ఈమెపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సమయంలో డాక్టర్ వ్యాఖ్యలతో మరింతగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం సుశాంత్ మృతిపై ఉన్న అనుమానాలు అన్ని తీరాలి అంటే రియా బీహార్ పోలీస్ ల ముందుకు రావాలంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారు.