బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంపై రోజుకో వార్త తెర మీదకు వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సంచలన నిజం బయటకు వచ్చింది.
అది తెలుసుకున్నవారికి సుశాంత్ సింగ్ మరణంపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.అసలు ఇప్పుడు ఏ నిజాలు బయటకు వచ్చాయి అనేది ఇక్కడ చూసి తెలుసుకుందాం.
సుశాంత్ సింగ్ రాజ్పుత్కు చెందిన డైరీలో కొన్ని కీలకమైన పేజీలు మిస్ అయినట్టు కేసు దర్యాప్తు చేసిన అధికారులు చెప్పారు.ఈ సంఘటనతో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదనడానికి అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
సుశాంత్ డైరీలో తన రోజు ఎలా గడిచింది అని రాసేవాడు అని అతని స్నేహితులు చెప్తున్నారు.
అంతేకాదు డైరీలో పేజీలు మిస్ అయినట్టు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, లాయర్ షెహదాద్ పూనావాలా కూడా చెప్పారు.
ముంబై పోలీసులు ఈ విషయాలన్నింటిని కావాలనే మూసి పెట్టారని చెప్పారు.కాగా ఈ కేసులో వర్తిరియా చక్ర ఆమె కుటుంబసభ్యులు నిందితులుగా నమోదయ్యారు.
కాగా సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం కేసులో రోజు రోజుకు పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.ఇప్పటికే సీబీఐ ముంబై పోలీసులు, బిహార్ పోలీసుల నుంచి కేసు విషయంపై పలు అధరాలు సేకరించింది.