దివంగత బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత ఈ అంశంపై రోజుకో సంచలన వార్త వెలుగులోకి వస్తోంది.తాజాగా ఈ కేసును సీబీఐ సీరియస్గా విచారిస్తుండడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రియా సుశాంత్ ఇంట్లో వారానికి మూడు నాలుగు పార్టీలు ఎరేంజ్ చేయడంతో పాటు సుశాంత్తో భారీగా ఖర్చు చేయించేదని… ఈ క్రమంలోనే సుశాంత్ ఒత్తిడి తట్టుకోలేక ఆ ఇంటిని అమ్మేయడానికి కూడా సిద్దమయ్యాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఇక సుశాంత్ మరణం వెనక బాలీవుడ్లో ఉన్న నెపోటిజం కూడా కారణమన్న టాక్ వస్తోంది.
ఈ అంశాలను ఆధారంగా చేసుకుని సుశాంత్ బయోపిక్ను తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది.శశాంక్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజ్బబ్బర్ కుమారుడు ఆర్యా బబ్బర్ హీరోగా నటిస్తున్నాడు.
శశాంక్ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే కాంటవర్సీ క్రియేట్ అయ్యింది.ఈ పోస్టర్లో హీరో ఆర్య బబ్బర్ ఉరి తాడు మధ్యలో ఉంటాడు.
ఇది ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతోందంటూ సుశాంత్ అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.సుశాంత్ కుటుంబ సభ్యులు సైతం ఈ పోస్టర్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారంటున్నారు.ఇక ఈ సినిమా అప్పుడే వివాదంలో చిక్కు కోవడంతో బాలీవుడ్ పెద్దలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారట.
ఇందులో బాలీవుడ్ టాప్ దర్శకులు, హీరోలు టాలెంట్ ఉండి… ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని హీరోలను ఎలా తొక్కేస్తున్నారో చూపిస్తే తమ జీవితాలు ఎక్కడ బయట పడతాయో ? అన్న ఆందోళనతో ఉన్నారు.ఇక ఈ సినిమాను సుశాంత్ ఫ్యాన్స్ బహిష్కరించాలన్న క్యాంపెయిన్కు.సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ మద్దతు పలికారు.దీంతో సినిమా పట్టాలెక్కకుండానే అప్పుడే చిక్కుల్లో పడింది.